Owaisi | కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజాపూర్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు వార్డుల్లో పోటీ చేస్తోంది. ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత ఇంటింటి ప్రచారం చేపట్టారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన హిజాబ్ గురించి ప్రస్తావించారు. హిజాబ్ ధరించిన ఓ ముస్లిం మహిళ భారత ప్రధాని అయితే చూడాలనుకుంటున్నా అంటూ వ్యాఖ్యానించారు. ఒవైసీ వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడుతున్నారు. ఎంఐఎం పార్టీ అధినేతగా హిజాబ్ ధరించిన మహిళ ఎప్పుడు ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు.