Suicide Cases | దేశంలో ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం.. 2021 సంవత్సరాంలో 10లక్షల మందికి 120 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు 2010 సంవత్సరంతో పోలిస్తే 6.1శాతం పెరిగింది. గతంతో పోలిస్తే ఒకే ఏడాదిలో ఇంత సంఖ్యలో ఆత్మహత్యలు జరుగడం ఇదే తొలిసారి. ఆత్మహత్యలు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2021లో దేశంలో యాక్సిడెంట్స్, ఆత్మహత్యలతో మరణాల డేటాను ఎన్సీఆర్బీ తయారు చేయగా.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసింది. విద్యార్థుల్లో , చిన్న వ్యాపారవేత్తల్లో ఆత్మహత్య మరణాలు పెరగడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. 2021లో అత్యధికంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 7.2 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో 2020 సంవత్సరంలో 1,53,052 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2019లో ఈ సంఖ్య దాదాపు 1.39లక్షలుగా ఉన్నది. అయితే, జనాభాపరంగా చూస్తే 2021లో ప్రతి పది లక్షల మంది జనాభాకు 120 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 1967 నుంచి చూస్తే ఇప్పటి వరకు ఇదే అత్యధిక మరణాలు కావడం గమనార్హం. దేశంలో ఇప్పటివరకు నమోదైన రెండో అత్యధిక ఆత్మహత్య రేటు 2010లో ప్రతి మిలియన్ జనాభాకు 113 మరణాలుగా ఉండేది. అత్యల్ప-ఆదాయ వర్గాలు (సంవత్సరానికి ₹1 లక్ష కంటే తక్కువ సంపాదిస్తున్న వ్యక్తులు) ఆత్మహత్య ద్వారా సంభవించే మరణాలు మూడింట రెండు వంతుల మంది అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నివేదిక పేర్కొంది.