న్యూఢిల్లీ : జన్యు వ్యవస్ధతో పాటు శారీరక వ్యాయామం లోపించడం వంటి కారణాలతో హృద్రోగాలు, జీవన శైలి వ్యాధులు వెంటాడుతుంటాయి. వీటితో పాటు ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కూడా శరీరం జబ్బుల బారినపడుతోంది. ఉప్పు వాడకం మితిమీరితే అధిక రక్తపోటు ముప్పు పొంచిఉంది. హైబీపీ స్ట్రోక్, గుండె పోటు, కిడ్నీ వైఫల్యం, డిమెన్షియా వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది.
అధికంగా ఉప్పు వాడకంతో శరీరంలో వాపు ప్రక్రియ తలెత్తి ఇంది అర్ధరైటిస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. ఫ్రోజన్, ప్రాసెస్డ్ ఆహారం, బ్రెడ్, రోల్స్, కోల్డ్ కట్స్ మీట్స్, పిజ్జా, పౌల్ట్రీ, శాండ్విచెస్లు ప్రస్తుతం అధిక ఉప్పుతో కూడిన ఆహార పదార్ధాలుగా మన డైనింగ్ టేబుల్స్పైకి చేరుతున్నాయి. ఇవన్నీ సాల్ట్ ఓవర్డోస్తో మనల్ని ముప్పు ముంగిట నిలిపేవేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగినంత ఉప్పు తీసుకుంటే కండరాలు, నరాలు సరిగ్గా పనిచేసేందుకు ఉపకరిస్తుంది. అయితే శరీరానికి అవసరమైన నిర్ధిష్ట మోతాదులోనే ఉప్పును తీసుకోవాలి. రుచి కోసం అదనంగా తీసుకునే ఉప్పు హానికరం. వంట చేసే సమయంలో అదనంగా ఉప్పు వేయడం మానుకోవాలి. సోడియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటంతో పాటు ఫాస్ట్ ఫుడ్స్, ప్రీ ప్యాక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ను పక్కనపెట్టాలి. తాజా పండ్లు, కూరగాయలు, నట్స్ను ఉప్పు లేకుండా సర్వ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.