తిరువనంతపురం : లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కేరళలో చాలాకాలంగా సాగుతున్న డ్రగ్, సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. ఈ ముఠా మలప్పురానికి చెందిన 14 ఏండ్ల బాలికను డ్రగ్స్కు బానిస చేసి నెలల తరబడి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని చైల్డ్లైన్ ఈ రాకెట్ను ఛేదించి బాలికను కాపాడింది. ఇన్స్టాగ్రాం ద్వారా స్కూల్కు వెళ్లే చిన్నారులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటోంది. ఆన్లైన్లో బాలికలతో స్నేహం చేస్తూ వారికి డ్రగ్స్ను అలవాటు చేసి లైంగికంగా వేధిస్తున్నారు. గతవారం టీనేజ్ బాలికను ఈ రాకెట్ చెర నుంచి కాపాడింది. తొలుత నిందితులు తనకు గంజాయి ఇచ్చేవారని ఆపై కొకైన్ ఇతర డ్రగ్స్ ఇచ్చి నెలల తరబడి లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. నిందితుల చెర నుంచి బాలికను కాపాడిన అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి బాధితురాలిని తరలించారు. నిందితులు బాలికకు డ్రగ్స్ను అలవాటు చేయడంతో ఆమె విత్డ్రాయల్ సింప్టమ్స్తో బాధపడుతోంది. బాలిక తెలిపిన వివరాల ఆధారంగా ఈ రాకెట్కు సంబంధించి పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఇప్పటికి ఒకరిని అరెస్ట్ చేశామని కల్పకంచెరి పోలీసులు తెలిపారు.