దిస్పూర్ : అసోంలో రూ.47కోట్ల విలువైన హెరాయిన్ను పట్టుకున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. పోలీసులు ట్రక్ డ్రైవర్ అరెస్టు చేయగా.. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే మరికొందరు స్మగ్లర్లను పట్టుకుంటామని తెలిపారు. మిజోరాం నుంచి కరీంగంజ్ మీదుగా త్రిపుర వెళ్తున్న ట్రక్కులో రూ.కోట్ల విలువైన హెరాయిన్ను తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించింది.
ఈ మేరకు బీఎస్ఎఫ్, కరీంగంజ్ పోలీసులు మంగళవారం కరీంగంజ్ రైల్వేస్టేషన్కు సమీపంలో ట్రక్కు నుంచి హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ను సబ్బు సంచుల్లో పెట్టి.. డ్రైవర్ క్యాబిన్లో దాచినట్లు పోలీసులు చెప్పారు. హెరాయిన్ 9.47 కిలోలు కాగా, విలువ రూ. 47.4 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. అసోంలో గత ఏడాది కాలంలో రూ.655 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్న 4,751 మందిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు.