Hero Moto Xtreme 160R 2.0 | ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ హీరో మోటో కార్ప్ దేశీయ మార్కెట్లోకి ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ ఎడిషన్ 2.0 బైక్ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1,29,738 నుంచి ప్రారంభం అవుతుంది. ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 వర్షన్ అన్ని వేరియంట్ బైక్లకు `హీరో కనెక్ట్` ఫీచర్ జత చేశారు. హీరో కనెక్ట్ యాప్లో జియో ఫెన్సింగ్ అలర్ట్ ( Geo fencing alert ), స్పీడ్ అలర్ట్ ( Speed Alert ), టాపిల్ (బోల్తా) అలర్ట్ ( Topple Alert ), టో అవే అలర్ట్ ( Tow Away Alert ), అన్ప్లగ్ యాప్ ( Unplug Alert ) ఫీచర్లు ఉంటాయి.
న్యూ ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 బైక్.. ఫ్రేమ్, ఫిల్లియాన్ గ్రీప్, టెలిస్కోపిక్ ఫోర్క్పై మ్యాట్ బ్లాక్ షేడ్ విత్ స్ట్రైకింగ్ రెడ్ అసెంట్స్ రంగుల్లో కనిపిస్తుంది. 163 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో న్యూ ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ వస్తోంది. ఇది 15.2 పీఎస్ ఇంధనాన్ని వెలువరిస్తుంది. 4.7 సెకన్లలో 60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఎక్స్ట్రీమ్ 160ఆర్ బైక్కు కస్టమర్ల నుంచి గిరాకీ వస్తుందని అంచనా వేస్తున్నారు.
స్టైల్, సేఫ్టీ, కనెక్టివిటీ, కంఫర్ట్ కాంబినేషన్తో న్యూ ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 బైక్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందని హీరో మోటో కార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజివ్జిత్ సింగ్ చెప్పారు. కనెక్ట్ 1.0, క్లౌడ్ కనెక్టెడ్ సిస్టమ్, ఫ్యాషనేట్ రైడర్స్తో ఐటీ నిపుణుల కోసం ఈ బైక్ రూపుదిద్దుకున్నదని సంస్థ స్ట్రాటర్జీ అండ్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లీ మాసన్ తెలిపారు.