న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ సంస్థలు మరో దఫా తమ వాహనాల ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే అతిపెద్ద ప్రయాణికుల తయారీ సంస్థ మారుతి సుజుకి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
తాజాగా ఇండియా పాపులర్ టూ వీలర్ కంపెనీ హీరో మోటో కార్ప్ తమ మోటారు సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఒక్కో బైక్ లేదా స్కూటర్ ధర రూ.2,500 పెరుగుతుందని, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధరల పెంపు అమలులోకి వస్తుందని తెలిపింది. వివిధ రకాల ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోవడంతోనే ధరలు పెంచుతున్నామని పేర్కొంది.
అయితే, వినియోగదారుడిపై కనీస స్థాయిలో మాత్రమే భారం మోపుతామని హీరో మోటో కార్ప్ తెలిపింది. సగటున ఒక బైక్ లేదా స్కూటర్పై రూ.2,500 చొప్పున పెరుగుతుంది. ఇక వివిధ రకాల మోడల్ బైక్స్, స్కూటర్ల ధరల పెరుగుదలలో తేడాలు ఉంటాయని పేర్కొన్నది.
స్టీల్, అల్యూమినియం, ప్లాసింగ్, ప్రీసియస్ మెటల్స్ ధరలు పెరిగాయి. గత జనవరిలోనే ఒక్కో బైక్/స్కూటర్ పై రూ.1,500 పెంచుతూ హీరో మోటో కార్ప్ నిర్ణయం తీసుకున్నది.
నిసాన్ ఇండియా అన్ని రకాల నిసాన్, దస్తన్ మోడల్ కార్ల ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెంచనున్నట్లు మంగళవారం తెలిపింది. నిసాన్లోని మాగ్నైట్, కిక్స్, డస్టన్ మోడల్స్లోని రెడీ-గో, గో, గో ప్లస్ మోడల్ కార్ల ధరలు పెరుగుతాయని తెలిపారు.
నిసాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాత్సవ స్పందిస్తూ.. కొన్ని నెలలుగా వివిధ ముడి సరుకుల ధరలు సర్దుబాటు చేశామన్నారు. కానీ ఆటో కంపొనెంట్ల ధరలు పెరిగిపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని నిసాన్, డస్టన్ మోడల్ కార్ల ధరలు పెంచుతున్నట్లు తెలిపారు. ఆయా మోడల్ కార్లకు అనుగుణంగా ధరలు పెరుగుతాయన్నారు.
‘మారటోరియం’ వడ్డీ మాఫీ..రూ.7500 కోట్ల భారం!
భారత్లోకి జాగ్వార్ తొలి ఎలక్ట్రిక్ కారు.. ధరెంతంటే!
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!