కిశోర్ బి డైరెక్షన్లో శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం శ్రీకారం. వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజేస్తూ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్తో ప్రదర్శించబడుతుంది. తొలి రోజు గురువారం (మార్చి 11) శ్రీకారం తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.4.01 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఏరియాల వారిగా పరిశీలిస్తే..నైజాంలో రూ.1.10 కోట్లు, ఆంధ్రాలో రూ.2.16 కోట్లు, సీడెడ్ జోన్లో రూ.75 లక్షలు షేర్స్ రాబట్టినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. కృష్ణా-రూ.0.25 లక్షలు, గుంటూరు రూ. 65 లక్షలు, వైజాగ్ 54 లక్షలు, ఈస్ట్ 30 లక్షలు, వెస్ట్ 28 లక్షలు, నెల్లూరు 14 లక్షలు వచ్చినట్టు సమాచారం.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై పరిమిత బడ్జెట్లో తెరకెక్కించిన శ్రీకారం త్వరలోనే బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకుంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించడగా..రావు రమేశ్, నరేశ్ కీలక పాత్రలు పోషించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.