విజయ్దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్ పోషించిన చిత్రం లైగర్ (Liger). డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా స్టోరీతో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా ఉందంటున్నారు సినీ జనాలు. కాగా లైగర్ మొదటి రోజు తెలంగాణ, ఏపీలో రాబట్టిన వసూళ్లపై తాజాగా ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది.
తాజా టాక్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో లైగర్ రూ.9.5 కోట్లు రాబట్టినట్టు సమాచారం. విజయ్ దేవరకొండ సినిమా విషయంలో ఈ ఫిగర్ ఎక్కువనే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే (Ananya Pandey)టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రమ్యకృష్ణ, వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీ రోల్స్ లో నటించారు.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా తెరకెక్కించారు. లైగర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. పాన్ ఇండియా మార్కెట్లో లైగర్ కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయన్నది మరో రెండు మూడు రోజులు ఆగితే తెలుస్తుంది.