హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ – విజయవాడ హైవేపై పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. చింతల్కుంట చెక్పోస్ట్, భాగ్యలత వద్ద రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భాగ్యలత వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వనస్థలిపురం – హయత్నగర్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. హయత్నగర్, పెద్ద అంబర్పేట్, సరూర్నగర్, చంపాపేట్, సైదాబాద్, వనస్థలిపురం, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్లో భారీ వాన పడింది.