హైదరాబాద్: ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రదేశం నుంచి తెలంగాణ, విదర్భల మీదుగా పశ్చిమ మధ్య ప్రదేశ్వరకు కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఈ నెల10 వరకు చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని చెప్పింది.
శనివారం రోజు నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.