హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల తీరాల మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇదిలా ఉండగా.. సోమవారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.