హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచికొట్టాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో నగర వ్యాప్తంగా వర్షం కురియడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, లంగర్ హౌస్, కార్వాన్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, మణికొండ, మెహిదీపట్నం, శంషాబాద్, గండీపేట్, కిస్మత్పూర్, నార్సింగి, కాటేదాన్, సోమాజిగూడ, ట్యాంక్బండ్, అమీర్పేట, నాంపల్లి, తార్నాక, సికింద్రాబాద్, అల్వాల్, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైజ్, రాంనగర్, ఎల్బీనగర్, ముషీరాబాద్, కోఠి, చాదర్ఘాట్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది.