అమరావతి,జూలై:ఆంధ్రప్రదేశ్ లో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.48గంటల పాటు ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా. సముద్రంలో అలల ఉధృతి పెరగడంతో మత్స్యకారులకు వాతావరణశాఖ అధికారులుహెచ్చరికలు జారీ చేశారు.