Heavy Rain Lashes | హైదరాబాద్ జంటనగరాల పరిధిలో అర్ధరాత్రి తర్వాత వర్షం దంచికొట్టింది. చార్మినార్, బహదూర్పురా, ఫలక్నుమా, బార్కస్, చాంద్రయాణగుట్ట, సైదాబాద్, మలక్పేట, నారాయణగూడ, హిమయత్నగర్లో వర్షం కురిసింది. చంపాపేట్, సంతోష్నగర్, చాదర్ఘాట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలీపురంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దాదాపు మూడు గంటల పాటు వర్షం కురిసింది.
పలు చోట్ల భారీ వర్షాపాతం నమోదవగా.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. వర్షాలకు మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. మూసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వంతన వద్ద రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షానికి పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వరద నీటిని మళ్లించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు.