శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 2,46,576 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. జూరాల స్పిల్ వేను నుంచి 1,51,262 క్యూసెక్కులు, పవర్ హౌస్ నుంచి మరో 33,799 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 61,515 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రస్తుతం జలాశయం నుంచి 3,41,618 క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు. కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,52,523 క్యూసెక్కులు వదులుతున్నారు.
ఏపీ పవర్ హౌస్ ద్వారా 30,838 క్యూసెక్కులు, తెలంగాణ పవర్ హౌస్ నుంచి 31,784 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.30 అడుగుల నీరు నిల్వ ఉన్నది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 211.4759 టీఎంసీల నీరున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్కు సైతం ఇన్ఫ్లో కొనసాగుతున్నది. 1,90,360 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 1,87,132 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 35 గేట్లను ఎత్తివేసి 1,51,455 క్యూసెక్కులు, మరో 33,890 క్యూసెక్కులు పవర్ హౌస్ ద్వారా దిగువకు నీరు వెళ్తున్నది.