హైదరాబాద్ : గులాబ్ తుఫాను కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతున్నది. కరీంనగర్లోని దిగువ మానేరు ప్రాజెక్టుకు మోయతుమ్మెద వాగుతో పాటు మధ్య మానేరు నుంచి వరద ప్రవాహం పెరిగింది. ఎల్ఎండీలో ప్రస్తుతం నీటి నిల్వ 23.55 టీఎంసీలు ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 24 టీఎంసీలు. దాదాపు ప్రాజెక్టు నిండడంతో 18 గేట్లు ఎత్తి దిగువకు 70వేల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు.