హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ రద్దు పిటిషన్పై ఈ నెల 1న జగన్ కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ వేశారని జగన్ కౌంటర్లో పేర్కొన్నారు. అయితే, రఘురామ తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదన్నారు. ఈ క్రమంలో కౌంటర్లో జగన్ పేర్కొన్న అంశాలపై ఎంపీ సమాధానమిచ్చారు. రఘురామ రీజాయిండర్పై వాదనలు వినిపించేందుకు జగన్ తరఫున న్యాయవాదులు.. న్యాయమూర్తిని సమయం కోరారు. ఈ మేరకు కోర్టు విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది.