ముంబై : అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో రాజ్కుంద్రా ఈ ఏడాది జూన్ నెలలో అరెస్టయ్యారు. దాదాపు రెండునెలల పాటు జైలు శిక్షణ అనుభవించారు.
ఆ తర్వాత ముంబై కోర్టు రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే అశ్లీల చిత్రాల కేసులో ఇరుకున్న రాజ్కుంద్రాపై తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. ముంబైలోని బాంద్రా పోలీసులు రాజ్కుంద్రాతో పాటు శిల్పాశెట్టిపై సైతం కేసు నమోదు చేశారు. నితిన్ బరై అనే వ్యక్తి రాజ్కుంద్రా, శిల్పాశెట్టి రూ.1.51కోట్లు మోసగించారని ఆరోపించారు.
ఫిట్నెట్ కంపెనీ పేరిట తనను మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. అశ్లీల చిత్రాల కేసులో జైలు నుంచి వచ్చిన తర్వాత రాజ్కుంద్రా బయట ఎక్కువగా కనిపించడం లేదు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను డిలీట్ చేశాడు. అంతకు ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవాడు.