న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హెల్త్ కేర్ వర్కర్లకు ప్రకటించిన బీమా పథకాన్ని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాల ఆరోగ్య కార్యదర్శులు, అధికారులకు సమాచారం ఇచ్చింది. కరోనాపై పోరులో ప్రాణాలు కోల్పోయిన హెల్త్కేర్ వర్కర్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా కేంద్రం బీమా పథకాన్ని ప్రకటించింది.