న్యూఢిల్లీ: ఈ నెల 5, 6 తేదీల్లో ‘చింతన్ శివిర్’ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించనున్నది. ‘భారత్తో స్వస్థత.. ప్రపంచానికి ఆరోగ్య కార్యకర్తల సరఫరా’ అన్న థీమ్తో ఢిల్లీలో రెండు రోజులపాటు వర్క్షాప్ జరుగనున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, సహాయ మంత్రి భారతీ పర్విన్ పవార్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఇందులో పాల్గోనున్నారు.
ఆరోగ్య రంగానికి చెందిన నిఫుణులు, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ కేవీ పాల్తోసహా ఇతర వైద్య ప్రముఖులు ఈ వర్క్షాప్కు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జాతీయ వైద్య సంఘం, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారత వైద్య మండలి వంటి సంస్థలు ఇందులో పాల్గొంటాయని, ప్రజెంటేషన్లు ఇవ్వడంతోపాటు చర్చల్లో భాగమవుతాయని ఆ వర్గాలు వెల్లడించాయి.