అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన బాలాజీ హేచరీస్ అధినేత సుందరనాయుడు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. చిత్రూరు జిల్లాకు చెందిన నాయుడు పశు వైద్యుడిగా వృత్తిని ప్రారంభించి ఉమ్మడి ఏపీలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.