కోల్కతా: మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరడంవల్ల తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ సౌగతారాయ్ వ్యాఖ్యానించారు. ఆయన ఒకప్పుడు స్టార్ అయ్యుండొచ్చుగానీ ఇప్పుడు మాత్రం స్టార్ కాదని చెప్పారు. మిథున్ ఇప్పటివరకు నాలుగుసార్లు పార్టీలు మార్చారని, ఆయన ముందుగా ఒక నక్సలైట్ అని, ఆ తర్వాత సీపీఎంలోకి, అనతరం తృణమూల్ కాంగ్రెస్లోకి వచ్చాడని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఆయనను రాజ్యసభ పంపితే ఇప్పుడు ఆ పదవిని వదిలేసి బీజేపీలో చేరాడని చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం అతనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కేసులు పెట్టించి బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. మిథున్కు ప్రస్తుతం పబ్లిక్లో అంత పలుకుబడి, గౌరవం లేదని, ఈ ఎన్నికల్లో ప్రజలపై అతని ప్రభావం ఏమాత్రం ఉండబోదని వ్యాఖ్యానించారు.