హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) 2022 విద్యాసంవత్సరానికి పలు విభాగాల్లో పరిశోధన (పీహెచ్డీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. పీహెచ్డీ అప్లికేషన్ గడువు డిసెంబర్ 31న ముగిసింది.
దరఖాస్తు ఫీజు: రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ రూ.275
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 21
వెబ్సైట్: http:acad.uohyd.ac.in, http://www.uohyd.ac.in చూడవచ్చు.