న్యూఢిల్లీ: పేలవ ఫామ్తో భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన చతేశ్వర్ పుజారా (198 బంతుల్లో 128 బ్యాటింగ్; 16 ఫోర్లు) కౌంటీ చాంపియన్షిప్లో దుమ్మురేపుతున్నాడు. సస్సెక్స్ తరఫున బరిలోకి దిగిన పుజారా.. ఆడిన ఐదు ఇన్నింగ్స్ల్లో మూడో సెంచరీతో విజృంభించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉండటం గమనార్హం. దుర్హంతో జరుగుతున్న పోరులో పుజారా అజేయ శతకంతో ఆకట్టుకోగా.. టామ్ అస్లాప్ (66), కెప్టెన్ టామ్ హైన్స్ (54), టామ్ క్లార్క్ (50) హాఫ్సెంచరీలు నమోదు చేయడంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి సస్సెక్స్ 5 వికెట్లకు 362 పరుగులు చేసింది. అంతకుముందు దుర్హం జట్టు తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకు ఆలౌటైంది. చేతిలో ఐదు వికెట్లు ఉన్న ససెక్స్ ప్రస్తుతం 139 పరుగుల ఆధిక్యంలో ఉంది.