చండీగఢ్ : కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని హర్యానా ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ను పొడగించింది. సోమవారంతో లాక్డౌన్ ముగియనుండగా.. మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వం నేతృత్వంలోని ప్రభుత్వం జూన్ 14న ఉదయం 5 గంటల వరకు పొడగించింది. ఈ సందర్భంగా కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్లు, బార్లు, మతపరమైన ప్రదేశాలను తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దుకాణాలను ఢిల్లీ తరహాలో సరి-బేసి విధానంలో తెరిచేందుకు అవకాశమిచ్చింది.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మాల్స్ తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లు, బార్లు 50శాతం సీటింగ్తో నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది. తప్పనిసరిగా సామాజిక దూరం, శానిటైజేషన్, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. అలాగే కార్పొరేట్ కార్యాలయాలు 50 శాతంతో నిర్వహించుకునేందుకు.. వివాహాలు, అంత్యక్రియల్లో 21 మంది పాల్గొనేందుకు అనుమతి ఇవ్వగా.. పెళ్లి అనంతర బరాత్పై నిషేధం విధించింది.