హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటి చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ మృతిపట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
1954లో బాల గంగాధర్ తిలక్ పిలుపు మేరకు సుదర్శన్ ముదిరాజ్.. ఖైరతాబాద్లో ఒక అడుగు ఎత్తుతో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారని చెప్పారు. 2022 నాటికి 68 ఏండ్లు పూర్తిచేసుకుని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తయిన వినాయకుణ్ణి ప్రతి సంవత్సరం ప్రతిష్టించారని వెల్లడించారు. వినాయక నవరాత్రులను ఏంతో ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణకే కాదు భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన మహానుభావుడు సుదర్శన్ అని కొనియాడారు. శ్రమశక్తి అవార్డు అందుకున్న సుదర్శన్ ముదిరాజ్.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల్లోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.