ములుగు, ఆగస్టు14 (నమస్తేతెలంగాణ) : భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేళ ఓ ఐపీఎస్ అధికారి హరిత యజ్ఞం చేపట్టాడు. 365 రోజుల్లో 365 మొక్కలు నాటాలని నిర్ణయించాడు. 15 ఆగస్టు, 2021 నుంచి రోజుకో మొక్క నాటుతూ సంరక్షిస్తు న్నాడు. శాంతిభద్రతలతోపాటు పచ్చదనానికి ప్రాముఖ్యతనిస్తున్నాడు. తనకు దొరికిన సమయాన్ని మొ క్కల రక్షణకు కేటాయిస్తున్నాడు. గతేడాది పంద్రాగస్టు రోజున ఎస్పీ సంగ్రామ్సింగ్ ములుగులోని తన అధికారిక నివాసంలో ద్రాక్ష మొక్కను నాటగా, నేడు 365వ మొక్కను నాటి లక్ష్యాన్ని పూర్తి చేయను న్నాడు. ప్రకృతి రక్షణలో తన వంతు కర్తవ్యాన్ని పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
వృత్తి రీత్యా బిజీగా ఉండే ఐపీఎస్ అధికారులు సమయం దొరికితే కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇష్టప డు తారు. కాని ములుగు జిల్లా ఎస్పీ శాంతిభద్రతలను రక్షించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం హరిత ప్రేమిడికుగా మారిపోయారు. తనకు దొరికిన కొంత సమయాన్ని మొక్కల రక్షణకు కేటాయిస్తూ గ్రీన్ మ్యాన్ ఆఫ్ ములుగుగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ నిలుస్తున్నారు. గత సంవత్సరం 2021 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సంద ర్భంగా ములుగులోని తన అధికారిక నివాసంలో ద్రాక్ష మొక్కను నాటి అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి ప్రతి రోజూ ఒక మొక్కను నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. స్వతంత్ర వజ్రో త్సవ వేడుకల్లో భాగంగా నేడు 365వ మొక్కను నాటనున్నారు.
మిషన్ 365 డేస్లో 365 మొక్కలు
భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మిషన్ 365 డేస్లో రోజుకో మొక్క చొప్పున ప్రతి రోజూ ఒక మొక్కను నాటి సంరక్షిస్తున్నాడు. గత సంవత్సరం ఆగస్టు 15న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్ని పనులు ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా పండ్లు, కూరగాయ లు, పూలు, మరి కొన్ని అరుదైన, నీడనిచ్చే మొక్కలను నాటుతూ వస్తున్నారు. దీంతోపాటు ప్రతి రోజూ నాటిన మొక్క విశిష్టత, శాస్త్రీయ నామం, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ట్విట్టర్, ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు. తన వంతుగా మొక్కల సంరక్షణకు చేస్తున్న కృషిని తెలియజేస్తున్నారు.
వృక్షరక్షకుడు… హరిత ప్రేమికుడు
ఏడాది కాలంగా మొక్కలను నాటడమే లక్ష్యంగా ఎంచుకున్న డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ వృక్ష రక్షకుడిగా.. హరితప్రేమికుడిగా మారారు. హరితహారం స్పష్టికర్త సీఎం కేసీఆర్తోపాటు గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ను స్ఫూర్తిగా తీసుకొని తాను ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. జూన్లో 300 రోజులు మొక్కలు నాటడం పూర్తి కాగా, మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడటంతో తన వంతు పాత్రను పోషిస్తున్నారు. తన అధికారిక నివాసంతోపాటు వృత్తి రీత్యా జిల్లాలో పర్యటించిన ప్రాంతాలు, పీటీసీ సెంటర్, పోలీస్ స్టేషన్, పర్యాటక ప్రాంతాల్లో మొక్కలను నాటి హరిత యజ్ఞంలో భాగస్వాములయ్యారు.