మీరు మెడికల్ కాలేజీ ఇస్తే.. ఎకడ ఇచ్చారో చెప్పండి. కాగితాలు చూపించండి. పేరుకు ఎయిమ్స్ ఇచ్చారు. అకడ ఆపరేషన్ థియేటర్ లేదు. ఆక్సిజన్ లేదు. బ్లడ్ బ్యాంకులేదు. ఒక ఆపరేషన్ జరగడం లేదు. విద్యార్థుల భవిష్యత్తు ఆగం అవుతున్నదనే ఉద్దేశంతో భువనగిరి దవాఖానలో ప్రాక్టికల్స్కు అనుమతి ఇచ్చాం.
– మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): మెడికల్ కాలేజీలపై బీజేపీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నదని, మాటలు ఎకువ చేతలు తకువ అన్నట్టుగా వ్యవహరిస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్రం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒకటి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. పైగా రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని ఆరోపిస్తున్నారని, ప్రభుత్వం రాసిన లేఖలను బయటపెట్టామని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు.
సోమవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలు తామే ఇచ్చామంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించడం దిగజారుడు, దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు మెడికల్ కాలేజీ ఇస్తే.. ఎకడ ఇచ్చారో చెప్పండి. కాగితాలు చూపించండి. పేరుకు ఎయిమ్స్ ఇచ్చారు. అకడ ఆపరేషన్ థియేటర్ లేదు. ఆక్సిజన్ లేదు. బ్లడ్ బ్యాంకు లేదు. విద్యార్థుల భవిష్యత్తు ఆగం అవుతున్నదనే ఉద్దేశంతో భువనగిరి దవాఖానలో ప్రాక్టికల్స్కు అనుమతి ఇచ్చాం’ అని వివరించారు. స్వయంగా డాక్టర్ అయిన గవర్నర్ సైతం ట్వీట్ చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఈ విద్యాసంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయని హరీశ్రావు ప్రకటించారు. కొత్తగా 1,200 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయమని, ఒకే విద్యాసంవత్సరంలో 1,200 సీట్లు అందుబాటులోకి రావడం దేశ చరిత్రలోనే బహుశా తొలిసారి అని అన్నారు. 2014తో పోల్చితే ఎనిమిదేండ్లలో ఎంబీబీఎస్ సీట్లు మూడురెట్లు, పీజీ సీట్లు రెట్టింపు అయ్యాయని చెప్పారు. 70 ఏండ్ల సమైక్యపాలనలో తెలంగాణ ప్రాంతంలో మూడు మెడికల్ కాలేజీలు (ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్) మాత్రమే ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం వస్తేనే మెడికల్ కాలేజీలు వస్తాయని, మన బిడ్డలకు న్యాయం జరుగుతుందని ఉద్యమ సమయంలో తాము చెప్పామని, స్వరాష్ట్రంలో ఇది నిజమైందని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఈ మేరకు ఈ ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఒక్కో కాలేజీకి సీఎం కేసీఆర్ రూ.510 కోట్ల చొప్పున మొత్తం రూ.4,080 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. రెండుమూడేండ్లలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటవుతుందని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కృషి చేసిన హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, 8 కాలేజీల ప్రిన్సిపాళ్లు, డాక్టర్ విమలా థామస్, డాక్టర్ వాణికి అభినందనలు తెలిపారు.
మెడికల్ కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్యతోపాటు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. కాలేజీ ఏర్పాటుతో 650 పడకల దవాఖాన అందుబాటులోకి వస్తుందని, 30 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు అందుతాయన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఇప్పటికే గాంధీ, ఉస్మానియా దవాఖానలకు రెఫరల్స్ తగ్గాయని చెప్పారు.
ఆర్ఎంపీలు, పీఎంపీలకు సబంధించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలో కొందరు అనర్హులైన వైద్యులు చిన్న చిన్న సర్జరీలు చేయడం వల్ల ప్రాణాలు పోతున్నాయని ఫిర్యాదులు వచ్చాయని, వారిని కట్టడి చేసేందుకు తనిఖీలు చేశామని తెలిపారు. ఇందుకు ఎవరూ దరఖాస్తు చేయలేదని, ప్రజల ప్రాణాలను కాపాడాలన్న తపనతోనే చేశామన్నారు. ఈ డ్రైవ్లో 2,058 దవాఖానలను తనిఖీ చేశారని, వీటిలో 103 వైద్యశాలలను సీజ్ చేశారని, 633 యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారని, 75 దవాఖానలకు జరిమానా విధించారని వివరించారు. ఒక ఎమ్మెల్యే కొందరిని తీసుకొచ్చి ఆర్ఎంపీలు, పీఎంపీలపై డీఎంహెచ్వోలు వేధింపులకు దిగుతున్నారని చెప్తే, ‘మీరు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. అప్పుడే అధికారులకు చెప్పగలుగుతాం. లేకపోతే చర్యలు తప్పవు’, అని చెప్పానన్నారు. అంతేతప్ప నకిలీ వైద్యులకు తాను మద్దతు ఇచ్చినట్టు కాదని స్పష్టంచేశారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 850 మాత్రమే ఉండేవని, ఇప్పుడు 2,902కు పెరిగాయని మంత్రి తెలిపారు. ఎనిమిదేండ్లలో 2,052 సీట్లు అదనంగా వచ్చాయని, మొత్తంగా సీట్లు 3.3 రెట్లు పెరిగాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి ఈ విద్యాసంవత్సరంలో 6,540 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీనికి అదనంగా బీ క్యాటగిరీ సీట్లలో ఇటీవలే 85 శాతం లోకల్ రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. అదనంగా 1,067 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయన్నారు. ప్రభుత్వ పీజీ సీట్లు 2014లో 613 ఉంటే, ఇప్పుడు 1,249కు పెంచామన్నారు.
ఈ ఏడాదే 192 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పీజీ సీట్లు పెంచుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి పీజీ సీట్ల సంఖ్య ప్రస్తుతం 2,449కి చేరిందన్నారు. నర్సింగ్ కాలేజీలు 2014లో 4 మాత్రమే ఉండేవని, ఇప్పుడు 9కి పెరిగాయన్నారు. బాన్సువాడ, జగిత్యాల, గద్వాల, సిద్దిపేట, సిరిసిల్లలో తరగతులు ప్రారంభం అయ్యాయని, మరో 10 కాలేజీలు త్వరలో ప్రారంభం కానున్నట్టు చెప్పారు. నర్సింగ్ సీట్లు 2014లో 240 ఉండగా ఇప్పుడు 1,680కి చేరుకున్నాయని, ఎనిమిదేండ్లలో 1,440 కొత్త సీట్లు వచ్చాయన్నారు. ప్రతి జిల్లా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ పెట్టాలన్నది సీఎం ఆకాంక్ష అని చెప్పారు. నర్సింగ్ విద్యార్థులకు ైస్టెఫండ్ కూడా పెంచామని గుర్తుచేశారు.