అహ్మదాబాద్: పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం బౌలింగ్కు దూరమైన పాండ్యా.. తిరిగి బంతినందుకోవడం టీమ్ఇండియాకు శుభపరిణామం. శుక్రవారం నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కోసం పాండ్యా నెట్స్లో చెమటోడుస్తున్నాడు. పరిమిత ఓవర్లలో పేస్ బౌలింగ్తో పాటు ఆఖర్లో ధాటిగా ఆడగల పాండ్యా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కోహ్లీసేనకు కొండంత బలం చేకూరినట్లే. బ్యాటింగ్లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్న ఈ హార్డ్హిట్టర్.. బౌలింగ్లోనూ ఫుల్ పేస్తో బంతులు విసురుతున్నాడు. అయితే రనప్తో పాటు బౌలింగ్ శైలిలో కాస్త మార్పులు చేసుకున్నట్లు కనిపిస్తున్నది. మరోవైపు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ సిరీస్లో బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలున్నాయని భారత మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ అభిప్రాయపడ్డాడు. ధవన్కు చోటు దక్కే అవకాశం లేదని.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయపడితేనే అతడికి చాన్స్ వస్తుందని దేవాంగ్ అన్నాడు.