ఖానాపూర్ టౌన్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచినందుకు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పాలాభిషేకం చేశారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్తో కలసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పారిశుధ్య పనులను చేపడుతూ నిరంతరం ప్రజలతో మమేకమైన సర్పంచ్, ఎంపీటీసీలను గుర్తించి గౌరవ వేతనాలు పెంచినందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్ మొయిద్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పర్శాపు శ్రీనివాస్, ఖానాపూర్, పెంబి మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.