న్యూఢిల్లీ: మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇన్విటేషన్ మేరకు ఆ దేశంలో 2 రోజులు పర్యటించనున్నట్టు చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో అక్కడ పర్యటించనున్నట్టు పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు అందునా మిత్ర దేశం బంగ్లాదేశ్కు వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందని నరేంద్రమోదీ అన్నారు. బంగ్లాదేశ్తో భారత్కు ఎంతో గాఢమైన సాంస్కృతిక, భాషా సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
శుక్రవారం బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవంతోపాటు బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతజయంతి వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయి. గత శతాబ్దంలో షేక్ ముజిబుర్ రెహ్మాన్ ఓ మహోన్నత నేతగా అని మోదీ కొనియాడారు. ముజిబుర్ ఆలోచనలు, జీవితం కోట్ల మందికి ప్రేరణగా నిలిచాయన్నారు. తుంగైపరలోని బంగబంధు ముజిబుర్ సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తానని తెలిపారు.
దూరదృష్టి కల షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ గొప్ప ఆర్థిక, అభివృద్ధి పురోగమనాన్ని ప్రశంసించడమే కాకుండా, ఆ దేశ విజయాలకు భారత్ మద్దతు ఉంటుందని చెప్పందుకు ఈ పర్యటన ఓ సూచికగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు.
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
పీఎస్యూల ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు : రాకేష్ జంఝన్వాలా
ఐసీఐసీఐ సంచలనం
వచ్చే ఏడాది వరకూ ఇంతే.. కొవిడ్-19 ఎఫెక్ట్పై మెజారిటీ సీఈవోలు
చందా కొచర్కు రిలీఫ్.. ఆమె భర్త దీపక్కు బెయిల్