తిరుపతి,జూన్ 24: అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడై హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. కరోనావ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించారు.స్వామివారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించారు. హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన శ్రీ కోదండ రాముడిని దర్శించడం వల్ల భోగ భాగ్యాలు,జ్ఞానవిజ్ఞానాలు,ఆయురారోగ్యాలు కలుగుతాయి.
మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 4గంటల వరకు ఆలయంలో వసంతోత్సవం జరుగనున్నది. సాయంత్రం 6:30 నుంచి 7గంటల వరకు గజవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవోకస్తూరి బాయి,ఏఈవో ప్రభాకర్ రెడ్డి,ఆలయప్రధానఅర్చకులు, కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు,సూపరింటెండెంట్ గోపాల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.