హాలియా, పెద్దవూర : పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రాష్ట్రంలో ఉన్న పేదింటి ఆడబిడ్డల కల్యా ణం తల్లిదండ్రులకు భారం కాకుడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని నాగా ర్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.
బుధవారం హాలియా పెన్షనర్స్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం 50 మందికి పెద్దవూర మండల కేంద్రంలోని మల్లిఖార్జున పంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 92 మందికి ఆయన చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలోనూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే తల్లిదం డ్రులు ఇబ్బందులకు గురికావద్దని నిధులు విడుదల చేశారన్నారు. రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేమేమావ లాంటివాడని అన్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ విశ్వాసం ఉంచి ఆశ్వీరదించాలని కోరారు.