న్యూఢిల్లీ : ఈ ఏడాది జరుగనున్న హజ్ యాత్రపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. హజ్యాత్ర సౌదీ అరేబియా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సౌదీ ప్రభుత్వ నిర్ణయానికి భారత్ అండగా ఉంటుందన్నారు. యాత్ర గత సంవత్సరం రద్దయిందని, ఈ సంవత్సరం ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని నఖ్వీ పేర్కొన్నారు.
కరోనా వైరస్ సంక్రమణ నేపథ్యంలో సౌదీ అరేబియా గతేడాది ఇతర దేశాలకు చెందిన యాత్రికులు హజ్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. పరిమిత సంఖ్యలో దేశీయ యాత్రలకే మాత్రమే అనుమతి ఇచ్చింది. పరిమిత సంఖ్యలో యాత్రకు అనుమతి ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా.. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా వరుసగా ఈ ఏడాది హజ్ యాత్రను రద్దు చేసింది.