భోపాల్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పోలీసులు రూ.కోటి విలువైన 7.2 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు నిందితులు మోరెనా జిల్లా వాసులని, ఇందులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు స్మగ్లర్లు ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నుంచి గంజాయి అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. కిలో గంజాయిని చిత్తూరులో కిలోకు రూ.2,800 నుంచి రూ.3వేల చొప్పున కొనుగోలు చేసి తీసుకువచ్చారని, ఇక్కడ కిలోకు రూ.15వేల నుంచి రూ.18వేల చొప్పున విక్రయిస్తున్నారన్నారు. పోలీస్ రిమాడ్లో ఉన్న నిందితులను విచారిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.