చిట్యాల, అక్టోబర్ 2 : గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మండలం పెద్ద కాపర్తిలోని గాంధీ గుడిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పూజలు చేశారు. మహాత్ముడి కలల సాకారం దిశగా రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.