అమరావతి : గురువులను వేధించిన వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోయారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు . గురుపూజోత్సవ సందర్భంగా ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన మద్దతు ఉంటుందని ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ దినోత్సవం కళావిహీనం తనను బాధ కలిగించిం దని పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఉపధ్యాయులు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు పెడుతున్న మానసిక క్షోభ, హింసకు ఇదే నిదర్శమని అన్నారు. సమాజ ఉన్నతికి ఉపాధ్యాయులే మార్గదర్శకులని పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. వేదకాలం నుంచి గురు, శిష్యుల అనుబంధం కాలాలకు అనుగుణంగా కొనసాగుతుందని అన్నారు.