హుజూరాబాద్ : జోరు వానలోను గులాబీ జోరు కొనసాగుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజక వర్గంలోని జమ్మికుంట పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు, ముదిరాజులు, యువకులు, సింగాపురం లోని గెస్ట్హౌజ్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి హరీశ్ రావు కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్వీ నాయకులు, ముఖ్య నాయకులు ఉన్నారు.