ఢిల్లీ ,జూన్ 8: దేశంలో వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది. రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ వేరశనగ పండుతుంది. మొత్తం ఉత్పత్తిలో, ఖరీఫ్ సీజన్లోనే 75 శాతానికిపైగా దిగుబడి వస్తుంది. నూనె గింజల ఉత్పత్తిపై, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ రూపొందించిన మూడో ముందస్తు అంచనాల ప్రకారం 2020-21లో వేరుశనగ ఉత్పత్తి 101.19 లక్షల టన్నులు వస్తుందని అంచనా. 2019-20లో వేసిన అంచనా 99.52 లక్షల టన్నులుగా ఉన్నది.