న్యూఢిల్లీ: 75 ఏళ్ల స్వతంత్ర వేడుకలను దేశం ఘనంగా జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన ఖరీదైన కారుకు జాతీయ జెండా రంగులు వేయించాడు. ‘హర్ ఘర్ తిరంగా’పై ప్రచారం చేస్తూ కుటుంబంతో కలిసి ఢిల్లీకి ప్రయాణించాడు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కలవాలనుకుంటున్నాడు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల నేపథ్యంలో గుజరాత్లోని సూరత్కు చెందిన సిద్ధార్థ దోషి తన దేశ భక్తిని విభిన్నంగా చాటాడు. ఖరీదైన జాగ్వార్ కారుకు జాతీయ జెండా రంగులు వేయించాడు. కారు బోనెట్తోపాటు డోర్లపై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార లోగోలను పెయింట్ చేయించాడు. దీని కోసం రెండు లక్షలు ఖర్చు చేశాడు.
కాగా, త్రివర్ణ పతాక రంగులతో అందంగా ముస్తాబైన కారును చూసి సిద్ధార్థ మురిసిపోయాడు. తన కుటుంబంతో కలిసి సూరత్ నుంచి ఢిల్లీకి ఇందులో ప్రయాణించాడు. 1,300 కిలోమీటర్ల దూరంలోని దేశ రాజధానిని రెండు రోజుల్లో చేరుకున్నాడు. ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద తన కారులో రౌండ్లు కొట్టి చూపరులను ఆకట్టుకున్నాడు.
‘హర్ ఘర్ తిరంగా’పై ప్రచారం కోసం తన కారుకు జాతీయ జెండా రంగులు వేయించడంతోపాటు సూరత్ నుంచి ఢిల్లీకి అందులో ప్రయాణించినట్లు సిద్ధార్థ తెలిపాడు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకోవాలని ఉందని మీడియాతో అన్నాడు. దీని కోసం వారి అపాయింట్మెంట్ను కోరినట్లు వెల్లడించాడు. కాగా, త్రివర్ణ పతాకం రంగుల్లో ఉన్న ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Delhi: A youth from Gujarat spent Rs 2 lakhs to revamp his car on the theme of #HarGharTiranga
“To make people aware of the campaign, I drove from Surat (Gujarat) to Delhi in my car in 2 days… we want to meet PM Modi & HM Amit Shah," said Sidharth Doshi pic.twitter.com/yC34603HaY
— ANI (@ANI) August 14, 2022