లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఒక పెళ్లిలో విచిత్రం జరిగింది. విందుకు ముందు పెళ్లికి వచ్చిన అతిథులను ఆధార్ కార్డ్ చూపించమని అడిగారు. దీంతో ఆగ్రహించిన కొందరు భోజనం తినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. యూపీలోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హసన్పూర్లోని ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో ఇటీవల ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఒకే వేదికపై పెళ్లి జరిగింది. ఈ వివాహానికి చాలా మంది అతిథులు రావడం చూసి ఆ కుటుంబం ఆందోళన చెందింది. పెళ్లికి పిలిచిన వారితోపాటు పిలువని వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో ఏం చేయాలో వారికి తోచలేదు. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులను ఆధార్ కార్డు చూపించమని అడిగారు. చూపించిన వారిని మాత్రమే విందు ఏర్పాటు చేసిన హాల్లోకి పంపారు.
మరోవైపు ఆధార్ కార్డ్ చూపించమని అడగటంపై పెళ్లికి హాజరైన కొందరు అతిథులు ఆగ్రహం చెందారు. దీంతో పెళ్లి భోజనం తినకుండా కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరి కొందరు తమ మొబైల్ ఫోన్లో దీనిని రికార్డు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A #viral video from Amroha, #UttarPradesh shows how guests at a wedding were allowed to feast only after showing their #Aadhaar cards pic.twitter.com/PUq9k7e2S2
— News18 (@CNNnews18) September 25, 2022