క్రికెట్ పండుగ ఐపీఎల్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ సారధి సంజూ శాంసన్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి క్వాలిఫైయర్లో కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి.
అప్పుడు ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి పాలైంది. అయినా సరే సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకోవడం గమనార్హం. తాము ఇక్కడ రెండో మ్యాచ్ ఆడుతున్నామని, అందరూ ఎగ్జయిటింగ్గా ఉన్నారని చెప్పాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని వెల్లడించాడు.
తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నామని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. తమ జట్టులో అల్జారీ జోసెఫ్ స్థానంలో లోకీ ఫెర్గూసన్ ఆడుతున్నట్లు తెలిపాడు.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఓబెడ్ మెకాయ్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, లోకీ ఫెర్గూసన్, యష్ దయాళ్, మహమ్మద్ షమీ
🚨 Toss Update 🚨@IamSanjuSamson has won the toss & @rajasthanroyals have elected to bat against the @hardikpandya7-led @gujarat_titans in the summit clash.
Follow The Final ▶️ https://t.co/8QjB0b5UX7 #TATAIPL | #GTvRR pic.twitter.com/AGlMfspRWd
— IndianPremierLeague (@IPL) May 29, 2022