బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. లక్ష్య ఛేదనలో జట్టుకు శుభారంభం అందించిన వృద్ధిమాన్ సాహా (29)ను హసరంగ అవుట్ చేశాడు. అతనువ ేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన సాహా.. పటీదార్కు చిక్కాడు. దీంతో గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (31) కూడా అవుటయ్యాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఓవర్లో అంతకుముందు బంతికే సిక్సర్ కొట్టిన గిల్.. ఐద బంతికి ఎల్బీగా అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.