అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకుప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బదిలీల ఫైల్పై సంతకం చేశారు. జూన్ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులను విడుదల చేయనున్నారు.
ఇది వరకు ఏపీలో 13 జిల్లాలు ఉండగా ఉగాది నుంచి మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొత్త జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాధారణ బదిలీల్లో కొంతమందిని కొత్తజిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు.