IPL Mega Auction | చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత క్రికెట్ అసోసియేషన్ (యూటీసీఏ) కుర్రాళ్లు.. ఐపీఎల్ గారెల బుట్టలో పడ్డారు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన ఫైనల్లో అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకున్న టీం ఇండియా సభ్యుల్లో రాజ్ అంగడ్ బావా కీలక పాత్ర పోషించాడు. బావాను ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టు రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. రాజ్ అంగడ్ బావాతోపాటు ఇదే సంఘానికి చెందిన మరో ప్లేయర్ సందీప్ శర్మ కూడా పంజాబ్ టీం గూటికే చేరాడు. సందీప్ శర్మను పంజాబ్ కింగ్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. మరో ప్లేయర్ మనన్ వోహ్రా.. చండీగఢ్ టీం సారధి.. ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్ ఆయన్ను రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.
పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎంపికైన రాజ్ అంగడ్ బావా తండ్రి స్పోర్ట్స్ అథారిటీ సీనియర్ కోచ్ సుఖ్విందర్ సింగ్ బావా. తన చేతుల మీదుగానే రాజ్ అంగడ్ను సుఖ్విందర్ సింగ్ క్రికెటర్గా శిక్షణ ఇచ్చాడు. ఇంతకుముందు యువరాజ్ సింగ్ వంటి ప్రముఖ క్రికెటర్లు కూడా సుఖ్విందర్ సింగ్ వద్ద ట్రైనింగ్ అయ్యాడు. రాజ్ అంగడ్ తాత ఎస్ తర్లోచన్ సింగ్.. ఒలింపిక్స్ కప్ గెలుచుకున్న ఇండియన్ టీం సభ్యుడు.
అయితే, తండ్రి సుఖ్విందర్ సింగ్.. తన తనయుడు రాజ్ అంగడ్ ఇంకా లెర్నింగ్ స్టేజీలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. వరల్డ్ కప్లో మంచి పెర్పార్మెన్స్ సాధించడంతో ఒక ముందడుగు వేశాడు. ఐపీఎల్కు రాజ్ అంగడ్ ఎంపిక తమ కుటుంబ సభ్యులతోపాటు చండీగఢ్ వాసులందరికీ గర్వ కారణం అని సుఖ్విందర్ సింగ్ చెప్పాడు. పలువురు జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడటం వల్ల రాజ్ అంగడ్కు అనుభవం లభిస్తుందన్నాడు.