నిజాంసాగర్/బిచ్కుంద, సెప్టెంబర్ 29 : జుక్కల్ నియో జకవర్గం విద్యాపరంగా దినదినాభివృద్ధి సాధిస్తున్నది. తాజా గా ఎమ్మెల్యే హన్మంత్షిండే చొరవతో బిచ్కుంద మండల కేంద్రానికి మైనార్టీ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బిచ్కుంద మండలంతోపాటు జుక్కల్ నియోజకవర్గ మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలలో 2022-23 సంవత్స రానికి గాను ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పిట్లం, నిజాంసాగర్, పెద్దకొడప్గల్తో పాటు ఇటీవల నూతనంగా మం జూరైన డోంగ్లీ కలిపి ఏడు మండలాలకు చెందిన మైనార్టీ విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసిన అనంతరం ఉర్దూ కళాశాల లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు. 10వ తరగతి వరకు ఉర్దూ మీడియం చదివిన ఆడపిల్లల్లో చాలామంది ఇంటర్ అందు బాటులో లేకపోవడంతో మానేశారు. ప్రతినిత్యం మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే హన్మంత్షిండే దృష్టికి ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం విన్నవించేవారు. ఉర్దూ మీడియం కళాశాల ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్తో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలుమార్లు ఎమ్మెల్యే విన్నవించారు. ఎట్టకేలకు ప్రభుత్వం జూని యర్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నియోజ కవర్గంలోని ఆయా మండలాలకు చెందిన మైనార్టీ ప్రజలు సంబు రాలు జరుపుకొంటున్నారు. ఎమ్మెల్యే హన్మంత్షిండే చొరవతో జూనియర్ కళాశాల మంజూరైందని సంబురపడుతున్నారు. ముఖ్యంగా బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, డోంగ్లీ, పెద్దకొడప్గల్ ఈ ఐదు మండలాలకు బిచ్కుంద కేంద్ర బిందువుగా ఉందని, ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల బిచ్కుందలో ఏర్పాటు చేయడం హర్షణీయమని విద్యార్థులతో పాటు మైనార్టీలు తెలుపుతున్నారు.
వెల్లువెత్తిన సంబురాలు..
బిచ్కుంద మండలానికి ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు కావడంతో సీఎం కేసీఆర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే చిత్రపటాలకు మైనారిటీ నాయకులు గురువారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకుడు అసద్ అలీ మాట్లాడుతూ బిచ్కుందకు కళాశాల మంజూరు చేయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే హన్మంత్షిండేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్పటేల్, మండల కో-ఆప్షన్ మెంబర్ జావిద్ అలీ, నాయకులు పాల్గొన్నారు.
‘జుక్కల్’ విద్యాహబ్గా మారుతున్నది
జుక్కల్ నియోజకవర్గం రోజురోజుకూ విద్యాహబ్గా మా రుతున్నది. ఎమ్మెల్యే హన్మంత్షిండే చొరవతో బిచ్కుంద మండల కేంద్రానికి ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే విద్యావంతుడు కాబట్టే చదువు విలువ తెలుసుకొని జుక్కల్ నియోజకవర్గాన్ని విద్యాహబ్గా మారుస్తున్నారు.
– అశోక్పటేల్, బిచ్కుంద ఎంపీపీ
మైనార్టీ విద్యార్థులకు తప్పిన ఇబ్బందులు
నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఉర్దూ మీడియం కళాశాల లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొనేవారు. ఎమ్మెల్యే కృషితో ఉర్దూ మీడి యం కళాశాల మంజూరు కావడం సంతోషంగా ఉంది. ఇక మైనార్టీ విద్యార్థులకు ఇంటర్ చదువుల కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
-అసద్అలీ, మైనార్టీ నాయకుడు, బిచ్కుంద
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ బోర్డు కమిషనర్కు కృతజ్ఞతలు. మైనార్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బిచ్కుందకు జూనియర్ కళాశాల మంజూరు చేశారు. నియోజకవర్గాన్ని విద్యాపరంగా మరింత అభివృద్ధి చేసుకుంటాం.
-హన్మంత్షిండే, జుక్కల్ ఎమ్మెల్యే