ఎథెన్స్: ఇద్దరు అబ్బాయిలు. తమ తాతా అమ్మమ్మలతో సరదాగా గడిపేందుకు బీచ్కు వెళ్లారు. సముద్రం ఒడ్డున ఆటుకుంటున్నారు. ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలల వల్ల వారు సముద్రంలోపలికి వెళ్తున్నారు. గమనించిన తాత వారిని రక్షించడానికి సముద్రంలోకి వెళ్లారు. అయితే బాలురు క్షేమంగా బయటపడగా, తాత మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గ్రీస్లోని క్రీట్ ద్వీపంలో చోటుచేసుకుంది.
సెలవు రోజు కావంతో బ్రిటన్కు చెందిన 61 ఏండ్ల వృద్ధుడు తన మనవళ్లతో కలిసి గ్రీస్లోని క్రీట్ ద్వీపంలో బీచ్కు వెళ్లాడు. 7, పదేండ్ల వయస్సు కలిగిన ఆ ఇద్దరు బాలురు సముద్రంలో సరదాగా ఆడుకుంటున్నాయి. అయితే ఒక్కసారిగా అలలు పోటెత్తడంతో వారు సముద్రంలోపలికి వెళ్లిపోతున్నారు. తన మనవళ్లు ఆపదలో ఉన్నారని గమనించిన తాత.. వారిని కాపాడటానికి ప్రయత్నించాడు. అయితే ఆ ఇద్దరు చిన్నారులు క్షేమంగా బయటపడగా, వృద్ధుడు మాత్రం చనిపోయాడని గ్రీస్ కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు.