ఖమ్మం, మార్చి 15: టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లాలో మిన్నంటాయి. నగరంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ఎంపీ సేవలను కొనియాడారు. నేటి యువత నామా సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఎంపీగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై పోరాటం చేస్తున్నారన్నారు. పార్టీ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి మాట్లాడుతూ.. ఎంపీ నామా తన తల్లిదండ్రుల పేరుపై ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజాసేవ చేస్తున్నారన్నారు. వేడుకల్లో పార్టీ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి, సుడా డైరెక్టర్ కొల్లు, నాయకులు పద్మ, స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఎంపీకి దేశవ్యాప్తంగా ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం రూరల్లో నాయకుడు తమ్మినేని కృష్ణయ్య ఆటోడ్రైవర్లకు ఖాకీ చొకాలు పంపిణీ చేశారు. నగరంలో టీఆర్ఎస్ మహిళా విభాగ నాయకులు ఉత్తమ సేవలు అందిస్తున్న ఈశ్వరి, వసంతను సత్కరించారు. నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణి చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి కనకమేడల సత్యనారాయణ, కార్పొరేటర్లు బుడిగెం శ్రీను, బుర్రి వెంకటేశ్వర్లు, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు కృష్ణచైతన్య, భారతిరాణి, మందా శైలజ, ప్రమీల, రాములమ్మ, ప్రియ, సుజాత, సుబ్బారావు, నరేందర్, శేషుకుమార్, లింగనబోయిన సతీశ్, విజయ్, శ్రీను, సింహాద్రి, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.