హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ ఆటోల్లో జనవరి 30లోపు జీపీఎస్ ఇన్స్టాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గురువారం మున్సిపల్ కమిషనర్లకు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. అన్కవర్డ్ ఏరియాలను గుర్తించేందుకు, ఆటోలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు పట్టణ ప్రగతి కింద ఇచ్చిన ఆటోల్లో తప్పనిసరిగా జీపీఎస్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గడువులోపు చేయకుంటే ఆటోలకు చెల్లింపులు/బ్యాంక్ రెంటల్స్ నిలిపివేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.